అవినీతి రహిత రాష్ట్రంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు దిశగా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశం.. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సాగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ విలీనం, సీపీఎస్ రద్దుపై చర్చించడానికి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల అమలు తేదీలను ప్రకటించింది. సహకార రంగం పునరుద్దరణకు చర్యలు తీసుకుంది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి మంత్రి కూడా తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైన మంచి సూచనలు చేస్తే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు