నెల్లూరులో కుళ్లిపోయిన చెన్నై చికెన్‌

నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన మాంసాన్ని నెల్లూరు చికెన్‌స్టాల్‌ యజమానులు చెన్నైలో తక్కువ నగదు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పద్మావతి సెంటర్‌లో ఓ చికెన్‌ స్టాల్‌ను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం సదరు స్టాల్‌పై కార్పొరేషన్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఫ్రీజర్లలో భారీగా కుళ్లిపోయిన, నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించారు. సుమారు 350 కేజీలకు పైగా కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top