దీప్తిశ్రీ ఎక్కడ

కిలకిలమని నవ్వుతూ నట్టింట పరుగులు తీసే ఆ చిన్నారి లేలేత పాదాలకున్న మువ్వల పట్టీలు ఘల్లుమంటూ సవ్వడి చేస్తే.. ఆ తండ్రి మది ఆనందంతో మురిసిపోయేది. తన జీవితంలో కొండంత సంతోషాన్ని పంచుతున్న ఆ కుమార్తెను తనకు బహుమతిగా ఇచ్చిన భార్య కన్నుమూస్తే.. ఆ పసిబిడ్డ ఆలనాపాలనా చూడడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. తన బిడ్డకు తల్లి లేని లోటును సవతితల్లి తీరుస్తుందని నమ్మాడు. తనకో కుమారుడు కలిగిన తరువాత.. ఆమెలో అనుమాన బీజాలు నాటుకున్నాయి. మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న తన భర్త.. తన కుమారుడికి అన్యాయం చేస్తాడేమోనని సందేహించింది. ఆ అనుమానమే పెనుభూతమవడంతో.. చివరికి తన సవతి కుమార్తెను కడతేర్చింది. కాకినాడ జగన్నాథపురం పాఠశాల వద్ద గత శుక్రవారం ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ ఐసానిని అపహరించి.. గొంతుకు తువ్వాలు బిగించి, తానే హతమార్చినట్టు ఆమె సవతి తల్లి శాంతికుమారి పోలీసుల విచారణలో వెల్లడించింది. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో పడేసినట్టు చెప్పింది. దీప్తిశ్రీ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top