ఫీజుల భూతానికి మరో చదువుల తల్లి బలైపోయింది
ఫీజుల భూతానికి మరో చదువుల తల్లి బలైపోయింది.. ఫీజు కట్టలేదంటూ పాఠశాల యాజమాన్యం పరీక్షలు రాయనీయకపోవడంతో ఆవేదన చెందింది. ‘నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్’అని సూసైడ్ నోట్ రాసి పెట్టి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్లోని మల్కాజిగిరి జేఎల్ఎస్ నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. జేఎల్ఎస్ నగర్కు చెందిన బాలకృష్ణ, సునీత భార్యాభర్తలు. బాలకృష్ణ పెయింటర్గా పనిచేస్తుం డగా, సునీత బోయిన్పల్లిలోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తోంది. వారికి సాయిలత, సాయిదీప్తి (14) ఇద్దరు కుమార్తెలు. సాయిలత బీటెక్ చదువుతుండగా.. సాయిదీప్తి స్థానికంగా ఉన్న జ్యోతి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఇటీవల బాలకృష్ణ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దీప్తి ఫీజులను చెల్లించలేకపోయాడు. దీంతో కొద్దిరోజు లుగా పాఠశాల నిర్వాహకులు ఫీజు చెల్లించాలం టూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన పరీక్షలకు దీప్తిని అనుమతించలేదు. దీంతో పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోగా.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అక్క సాయిలత ఇంటి వద్దనే ఉంది. త్వరగా వచ్చావేమిటని అక్క అడగటంతో ఫీజు కట్టలేదంటూ పరీక్ష రాయనీయలేదని బాధతో చెప్పింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు