క్షణాల్లో భారీ వంతెనను కూల్చేశారు
రెప్పపాటులోనే భారీ బ్రడ్జిని నేలమట్టం చేశారు. న్యూయార్క్ మహానగరంలో అతిపెద్ద కౌంటీలైన బ్రూక్లిన్, క్వీన్స్లను కలుపుతూ 78 ఏళ్ల కిందట నిర్మించిన కిజ్కియాస్కో వంతెనను అధికారులు ఆదివారం ఉదయం పేల్చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈస్ట్ నదికి ఉపనది అయిన న్యూటౌన్ క్రీక్పై కట్టిన కిజ్కియాస్కో బ్రిడ్జి పొడవు 1.8 కి.మీలు. వెడల్పు 38 మీటర్లు. 1939, ఆగస్టు 23న ప్రారంభమైన ఈ బ్రాడ్జిని నాటి అంచనాల దృష్ట్యా రోజుకు 10వేల కార్లు ప్రయాణించగల సామర్థ్యంతో నిర్మించారు. కానీ క్రమంగా కిజ్కియాస్కోపై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య 1.8 లక్షలకు పెరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు