జాగో బాగో అంటూ కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారు
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఓ పక్క తెలుగువారంతా కలిసుండాలంటూనే.. జాగో బాగో అంటూ కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో టీడీపీ వాళ్లు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసునని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ చేజిక్కించుకుందా అని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు