వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెడతాం

వ్యవసాయ రంగంలో ప్రైవేటుగా పెట్టుబడులు పెడతామని, అందుకు అవకాశమివ్వాలని రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెలగపూడి సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ) సెంటర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖేష్‌ మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు దేశానికి పెద్ద సవాలు వంటివని, వాటిలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలివ్వాలన్నారు. వ్యవసాయ రంగంలో తమ కంపెనీ పెట్టుబడులు పెడుతుందని, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. ప్రస్తుతం  దేశంలోని ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top