వివాదంలో మంత్రి మేనల్లుడు. కాపురానికి తీసుకెళ్లడంలేదు
తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. తన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆమె మేనల్లుడు రాణా ప్రతాప్ భార్య ఆందోళకు దిగింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ముందు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. రాణాప్రతాప్ డ్రగ్స్, మద్యం ఇతర చెడు ఆలవాట్లకు బానిసగా మారాడని, తనతో కాపురానికి రావడంలేదని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తొలుత పోలీసులను ఆశ్రయించానని, అయినా కూడా తనకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద మనుషులు కూర్చోని మాట్లాడి వివాదం పరిష్కరిస్తామని చెప్పిన ఇన్ని రోజులు గడిపారని ఆమె ఆరోపించింది. దీంతో వివాదం తీవ్రం కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు