చంద్రబాబుది జుగుప్సాకరమైన రాజకీయం

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ బాబు.. ఇద్దరూ యూ టర్న్‌కు అలవాటు పడ్డారని మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు ఇంగ్లీష్‌ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నేడు ఇంగ్లీష్‌ను తానే తీసుకువచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తాను నమ్మిన సిద్ధాంతం యూ టర్న్‌లో దిట్ట అని, తండ్రి లాగే తనయుడు కూడా యూ టర్న్‌కు అలవాటు పడ్డాడని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దైర్యం లేక మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసే గుంటనక్క రాజకీయాలను ప్రజలు నమ్మరని మంత్రి పేర్కొన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top