41 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా 41,37,675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈనెల 5 నుంచి నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి సోమవారం వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశామని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 102 ఇసుక రీచ్లను, 51 స్టాక్ యార్డ్ లను సిద్ధం చేశామన్నారు. మొత్తం 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సరఫరా కోసం టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు