ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారు
ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడంలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మంత్రి సమక్షంలో మాచారం కాంగ్రెస్ ఎంపీపీ ఎల్. నర్సింగరావు,తదితరులు టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలని తిట్టకపోవడంతో తెగ బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు