డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించిన మంత్రి గంటా
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ షెడ్యూల్ను గురువారం ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ రేపే(శుక్రవారం) వెలువడనుందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లుగా అనేక సాంకేతిక కారణాల నోటిఫికేషన్ ఆలస్యమైందని పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా టెట్ కమ్ టీఆర్టీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు కేటగిరీల్లో మొత్తం 7,675 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 2 వరకు వివిధ కేటగిరీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు