వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి: కేటీఆర్
అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సెమీకండక్టర్ల తయారీ కంపెనీ ‘మైక్రాన్ టెక్నాలజీ’హైదరాబాద్లో తమ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. సింగపూర్, తైవాన్, జపాన్, చైనా, మలేసియా దేశాల్లో భారీ స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకుంది. మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ డ్రేక్, డైరెక్టర్ అమరేందర్ సిద్ధూలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కె.తారకరామారావుతో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపింది. మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ విస్తరణ కోసం హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడం పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. రూ.300 కోట్ల పెట్టుబడితో నగరంలో ఏర్పాటు చేయనున్న మైక్రాన్ టెక్నాలజీ పరిశ్రమతో 1,000 మంది ఇంజనీరింగ్, ఐటీ వృత్తి నిపుణులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. మైక్రాన్ సంస్థ రాకతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఊతం కలగనుందని కేటీఆర్ తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు