వరుస పేలుళ్లతో 24 మంది సజీవ దహనం

ఓ బాణసంచా కేంద్రంలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లతో సుమారు 24 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన గురువారం మెక్సికో పట్టణంలోని టుల్‌పెక్‌లో చోటు చేసుకుంది. వరుస పేలుళ్లు సంభవించడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మొదటి పేలుడుతోనే సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర విభాగాలు ఘటనా స్థలికి చేరి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో మరోసారి పేలుడు సంభవించడంతో సహాయ చర్యల్లో పాల్గొన్న పోలీసులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top