అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద విషాదం

నగరంలోని అమీర్‌పేట (మైత్రివనం) మెట్రో స్టేషన్‌ కింద ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌ పైనుంచి పెచ్చులు ఊడిపడి ఓ యువతిమృతి చెందింది. మృతురాలు కేపీహెచ్‌పీకి చెందిన మౌనిక (24)గా గుర్తించారు.  భారీ వర్షం కురుస్తుండటంతో మౌనిక మెట్రో స్టేషన్‌ మెట్ల కింద నిలబడి ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి ఆ పెచ్చు పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమెమృతి చెందింది.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top