వేదికపై కేటీఆర్‌.. ఆనందంతో గంతులేసిన మల్లారెడ్డి

మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి తనదైన వ్యవహారశైలితో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ కాలేజ్‌ల్లో ఆయన చేసే ప్రసంగాలు, డ్యాన్సులకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తుంది. యువతను ఉత్తేజ పరిచేలా ఆయన చేసే సరదా వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సందర్భాలు అనేకం. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇటీవల మల్లారెడ్డికి కార్యకర్తలు చేసిన పాలాభిషేకం వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అపద్ధర్మ మంత్రి కేటీఆర్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు ధూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కేటీఆర్‌ వేదికపైకి చేరుకున్న అనంతరం.. ఆనందంతో అక్కడున్నవారికి అభివాదం చేసిన మల్లారెడ్డి.. విజయకేతనం చూపుతూ.. చిన్నగా గెంతేశారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. మల్లారెడ్డి చర్యతో కేటీఆర్‌ కూడా ముఖంలో నవ్వుని ఆపుకోలేకపోయారు కేటీఆర్‌ ప్రసంగం తర్వాత మైక్ అందుకున్న మల్లారెడ్డి తనదైన డైలాగ్‌లతో చెలరేగారు. మధ్యలో కేటీఆర్‌ వారించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన తన మార్కు ప్రసంగాన్ని కొనసాగించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top