స్పీకర్‌ పర్యటనలో ఉద్రిక్తత

శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాద రావుకు అనంతపురంలో ఊహించని సంఘటన ఎదురైంది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలం‍టూ న్యాయవాదులు ఆయన పర్యటనను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్‌ పర్యటలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం స్పీకర్ ను కలిసిన న్యాయవాదులు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీభాగ్ ఒప్పందం మేరకు రాజధాని ఒక చోట పెడితే మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని వివరించారు. సీఎం చంద్రబాబు మరోసారి రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top