కాంగ్రెస్‌లో హేమాహేమీలు నియోజకవర్గంలోనే తిష్ట వేశారు

‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకున్నవాళ్లు, హేమాహేమీలు.. వాళ్ల సొం‍త నియోజకవర్గాన్ని దాటి బయటికి రాలేదు. ఓటమి భయంతో సొంత నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఇది చాలదా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఏంటో తెలియడానికి’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మొహం చూస్తే ఓట్లు రాలవని గ్రహించిన కూటమి నాయకులు చివరిరెండు రోజుల్లో పేపర్‌ ప్రకటనల్లో ఆయన ఫొటోను వేయలేకపోయారని చురకలంటించారు. గజ్వెల్‌లో కేసీఆర్‌ 75 వేల భారీ మెజారిటీతో గెలుస్తాడని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల తరపున ప్రచారం చేయడానికి మరో స్టార్‌ కావాలని ఎద్దేవా చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top