హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకులు

తమ శాసనసభ సభ్యత్వాల రద్దుపై కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ గురువారం హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రొసీడింగ్ సరిగా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే తమపై చర్య తీసుకున్నారని న్యాయస్థానానికి విన్నవించారు. తమపై అనర్హత వేటు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు రేపు విచారించనుంది.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top