టీడీపీ ఏపీ ప్రజల ఆదరణ కోల్పోయింది
ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ఏపీ ప్రజల ఆదరణ కోల్పోయిందని, సమస్యలపై పోరాటం చేస్తూ బీజేపీ ప్రజల మన్ననలు పొందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఆదివారం తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ప్రజా ధన్యవాద సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో బీజేపీ బలపడుతుందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను రాహుల్ కాళ్లదగ్గర పెట్టిన చంద్రబాబును ఏపీ ప్రజలు క్షమించరని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు