పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలి

: సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయ్యాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. సోమవారం కరీంనగర్‌, జగిత్యాల నియోజకవర్లాల్లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించబోతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నాలుగేళ్ల తమ పాలనలో సంపద పెంచి పేదలకు పంచామని, 17.17 శాతం అభివృద్ధితో తెలంగాణ.. దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అదే స్థాయిలో జరగాలన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top