కాళేశ్వరం 65 శాతం సాఫల్యత పొందింది
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు.. ఆయనది హఫ్ నాలెడ్జ్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ, సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సజీవంగా కనిపిస్తోన్న గోదావరిని చూసి తన మనసు పులకిస్తోంది అన్నారు. గోదావరి నదిలోనే 100 టీఎంసీల నీరు నిండుకుండలా సజీవంగా ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంప్హౌస్ ఒక్కో ప్రాజెక్టుతో సమానమని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు