ఏం చేయబోతామన్నది త్వరలో చూపిస్తాం: కేసీఆర్
త్వరలోనే దేశ రాజకీయాల్లో సమూల మార్పులు చూస్తారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద మెజారిటీతో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడారు. దేశ రాజకీయాల్లో మార్పులు చూడబోతున్నారన్న కేసీఆర్.. ఏం చేయబోతామన్నది త్వరలో చేసి చూపిస్తామన్నారు. దేశంలో 15 కోట్ల మంది రైతులు ఉంటే, వారంతా అన్నమో రామచంద్రా అంటూ ఉన్నారని, ఈ దేశంలో 70వేల టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ 30 వేల టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవడం నిజంగా సిగ్గుచేటన్నారు.పార్టీ గెలిచిందని శ్రేణులు ఎవ్వరూ కూడా అతిగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యంగా వినయం, విధేయత అనేది అవసరమన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు