రహస్య భేటీలో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌

ఎన్నికల వేడికి ‘పార్టనర్స్‌’ ముసుగు కరిగిపోతోంది! ఇన్నాళ్లూ మభ్యపెట్టేలా తెరపైన విమర్శలు చేసుకుంటూ లోపల చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్న టీడీపీ, జనసేన పార్టీల నిజ స్వరూపాలు బట్టబయలవుతున్నాయి. ఈ రెండు పార్టీలూ సాధారణ ఎన్నికల్లో మరోసారి కలసి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులపై ఇప్పటికే ‘ఇద్దరు మిత్రులు’ మధ్య అంతర్గతంగా ప్రాథమిక అవగాహన కుదిరి నట్లు తెలుస్తోంది. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందానికి వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు రహస్యంగా భేటీ అయి ఈ దిశగా ఇప్పటికే చర్చలు సాగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల పొత్తులపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే సంఖ్యపై కూడా దాదాపు ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top