ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలం
ఆర్టీసీ సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య బుధవారం జరిగిన తొలిదశ చర్చలు విఫలమయ్యాయి. సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లలో ఏ ఒక్కదానికి కూడా కమిటీ నుంచి నిర్దిష్ట హామీ రాకపోవటం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రతిపాదన లాంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందీలేనిదీ చెప్పకపోవటం, అసలు ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఎప్పట్లోగా ఇస్తుందో కాల పరిమితి వెల్లడించకపోవటంపై కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. ఇలాంటివేమీ లేకుండా సమ్మె ఆలోచన విరమించుకోవాలని చెప్పడాన్ని తప్పు పడుతూ, సమ్మె విషయంలో తమ ఆలోచన మారదని పేర్కొన్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు