వంశపారంపర్య అర్చకత్వంపై కీలక తీర్పు

వంశ పారంపర్య అర్చకత్వంపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ చట్టం 1987 ప్రకారం అర్హులైన అర్చక కుటుంబ సభ్యులు వంశపారంపర్య అర్చకులుగా కొనసాగవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. రద్దు చేసిన 17/1966 ఏపీ దేవాదాయ చట్టంలో అర్హులైన అర్చక కుటుంబ సభ్యులుగా అర్చకత్వంలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో, వారికి వంశపారంపర్య అర్చకులుగా కొనసాగే హక్కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక వంశపారంపర్య అర్చకుడికి కొడుకులు లేని పక్షంలో అతని కుమార్తె కొడుకు (మనుమడు) సైతం వంశపారంపర్య అర్చకుడిగా కొనసాగవచ్చునని స్పష్టం చేసింది. వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ వచ్చిన రమణదీక్షితులను ఆ పదవి నుంచి టీటీడీ అధికారులు ఇటీవల తప్పించిన నేపథ్యంలో ఈ తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top