పొత్తులపై చంద్రబాబును నిలదీసిన హరీశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలను నిలువునా ముంచారని తెలంగాణ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు నాయుడు 2014 మేనిఫెస్టోను అమలు చేయలేదని తెలిపారు. ఏపీలో రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో.. వారు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు. ఏపీలో డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. వడ్డీలు కూడా కట్టలేదని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ కాంగ్రెస్ విడుదల చేసిన చార్జ్షీట్ను ఆయన మీడియాకు చూపెట్టారు. ఏపీలో హామీలు అమలు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ వారం రోజులు ‘ప్రజావంచన వారం’ పేరుతో నిరసన దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు