ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడులోని తిరువార్ జిల్లా మన్నార్గుడిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. సింగారవేలు అనే వ్యక్తికి మన్నేనగర్లో బాణాసంచా తయారీ కర్మాగారం ఉంది. రోజువారీ దినచర్యలో భాగంగా బుధవారం కూడా సింగారవేలుతో సహా మరో ఏడుగురు కార్మికులు కర్మాగారానికి వచ్చారు. ఈ క్రమంలో బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వారు పనిచేస్తున్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో యజమాని సింగారవేలు సహా సురేష్, బాబు, మోహన్, వీరయ్యన్లతో పాటు మరో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు