ఆ ఘనత వైఎస్‌ జగన్‌దే : హీరో సుమన్‌

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సమన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే అని సినీ హీరో సుమన్‌ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. తాను పుట్టిన తర్వాత ఒకే పార్టీకి (వైఎస్సార్‌సీపీ -151) ఇన్ని సీట్లు రావడం ఇదే తొలిసారి అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top