తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు ముగిసింది. దాదాపు 2500 వరకు నామినేషన్లు దాఖలైనట్టు అంచనా. చివరిరోజు కావడంతో సోమవారం నామినేషన్లు పోటెత్తాయి. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో పాటు స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 22 వరకు గడువు ఉంది. డిసెంబర్ 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11న ఓట్లను లెక్కిస్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు