తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు ముగిసింది. దాదాపు 2500 వరకు నామినేషన్లు దాఖలైనట్టు అంచనా. చివరిరోజు కావడంతో సోమవారం నామినేషన్లు పోటెత్తాయి. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో పాటు స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 22 వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 7న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 11న ఓట్లను లెక్కిస్తారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top