దంపతుల మధ్య కలహాలకు చిన్నారులు బలి

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను గుండెలపై ఆడించాల్సిన తండ్రి ఊపిరి తీసేశాడు. భార్యభర్తల మధ్య గొడవలకు అభంశుభం తెలియని చిన్నారులను బలితీసుకున్నాడు. ముక్కు పచ్చలారని ముగ్గురు మగపిల్లలను కర్కశంగా నీటిలో ముంచి చంపాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బలగంగానపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చిత్తూరు రూరల్‌ మండలంలోని దిగువపల్లికి చెందిన అమరావతి అనే మహిళతో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top