చంద్రబాబు జిమ్మిక్కులకు ఈసీ ఝలక్
ప్రజలను అయోమయానికి గురిచేసి.. ప్రతిపక్ష పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మిక్కులకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరు నంబూరు శంకరరావు కాగా.. ఓటర్లను అయోమయానికి గురిచేసే ఉద్దేశంతో ఇక్కడ ప్రజాశాంతి పార్టీ నంబూరి శంకరరావు అనే పేరు గల మరో వ్యక్తిని నిలబెట్టింది. అయితే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల కమిషన్ మంగళవారం తిరస్కరించింది. నామినేషన్ను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. దరఖాస్తును అభ్యర్థి సరిగ్గా పూర్తి చేయకపోవడంతో నిబంధనల మేరకు తిరస్కరించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు