జస్టిస్ దిశ: ఏబీవీపీ భారీ ర్యాలీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు నిరసనగా ‘జస్టిస్ దిశ’ పేరుతో ఏబీవీపీ హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఎస్వీకే నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేయకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. దిశకు న్యాయం జరిగేవరకూ తమ ఉద్యమం ఆగదన్నారు. దిశ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు. దిశ ఇంటికి ఫోన్ చేయాల్సింది కాదు, పోలీసులకు ముందు ఫోన్ చేయల్సిందని హోం మంత్రి అనడం సిగ్గు చేటన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు