304వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 304వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం  జీయమ్మ వలస మండలంలోని శిఖబడి క్రాస్‌ నుంచి ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్‌ ముందుకు కదులుతున్నారు. అక్కడి నుంచి బిజేపురం, గెద్ద తిరువాడ, యిటిక, కుందర తిరువాడ క్రాస్‌, చిన్న కుదమ క్రాస్‌ మీదుగా తురకనాయుడు వలస వరకు పాదయాత్ర కొనసాగనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top