304వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 304వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం జీయమ్మ వలస మండలంలోని శిఖబడి క్రాస్ నుంచి ప్రారంభించారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్ ముందుకు కదులుతున్నారు. అక్కడి నుంచి బిజేపురం, గెద్ద తిరువాడ, యిటిక, కుందర తిరువాడ క్రాస్, చిన్న కుదమ క్రాస్ మీదుగా తురకనాయుడు వలస వరకు పాదయాత్ర కొనసాగనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు