248వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 248వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం యలమంచిలి నియోజకవర్గంలోని కొండకర్ల​ క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి కొండకర్ల జంక్షన్‌, హరిపాలెం జంక్షన్‌, తిమ్మరాజు పేట, పెద్దపాడు క్రాస్‌ మీదుగా మునగపాక రోడ్డు (బ్రిక్‌ యూనిట్‌) వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు. నేనున్నానంటూ వారికి భరోసానిస్తున్నారు. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2826.9 కిలోమీటర్లు నడిచారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top