206వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 206వ రోజు అశేష ప్రజానీకం మధ్య ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ జననేత చేపట్టిన పాదాయత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహల మధ్య గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. ద్రాక్షారామం నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అక్కడ నుంచి వెలంపాలెం మీదుగా జగన్నాయపాలెం వరకూ వైఎస్‌ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. రాజన్నబిడ్డను కలవడానికి, తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top