మైదానంలో క్రికెట్ ఆడుతూ.. కుప్పకూలాడు!
నగరంలోని జీహెచ్ఎంసీ మైదానంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఓ ప్లేయర్ హఠాన్మారణం చెందాడు. హెచ్ఎస్బీసీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వీరేంద్ర నాయక్.. సికింద్రాబాద్ మారేడ్పల్లి చెన్నై గ్రౌండ్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఓపెనర్గా బ్యాటింగ్ చేసిన వీరేంద్ర నాయక్ 55 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత గ్రౌండ్ నుండి విశ్రాంతి గది వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. హుటాహుటిన అతన్ని స్థానిక ఆస్పత్రి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు