అభిమాని కోరిక తీర్చిన వైఎస్ జగన్

రాజన్న తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయనకు సోమవారం  దేవురపాలెంకు చెందిన కార్పొరేటర్‌ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్‌)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ...ఆ బైక్‌ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు,అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top