మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు
మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్తో చేతులు కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అజిత్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియా ముఖంగా ప్రకటించారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ రాక్రే తదితర నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అజిత్ నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరని, బీజేపీతో ఎన్సీపీ ఎన్నడూ చేతులు కలపలేదన్నారు. అజిత్ స్థానంలో ఈ సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక జరుగుతుందన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు