ఆర్టీసీ విలీన ప్రక్రియలో తొలి అడుగు
ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియలో తొలి అడుగు ముందుకు పడింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఛైర్మన్గా మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఈడీ, రిటైర్డ్ ఇంజినీర్ సుదర్శనం సభ్యులుగా నియమితులయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం, ఆర్టీసీ కార్మికుల ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారంపై ఈ అధ్యయన కమిటీ నివేదిక ఇవ్వనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు