అమరావతికి అన్యాయం చేయను : సీఎం జగన్
అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యూడీషియల్ క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ నేతలకు రైతులపై ప్రేమలేదని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి వారు ప్రపంచ చరిత్రలోనే ఉండరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను పోగొట్టుకున్నామని గుర్తు చేశారు.వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన శాసన సభలో సోమవారం మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు