పరీక్షల సంఖ్య పెంచండి

సాక్షి, అమరావతి :  కరోనా (కోవిడ్-19) పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు.  కోవిడ్‌–19 నివారణ చర్యలతో పాటు,  వైరస్‌ వ్యాప్తిని నియంత్రణపై ఆదివారం ఆయన  తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి జిల్లాలోనూ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే రెడ్‌ జోన్లులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top