జైపాల్రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. జైపాల్రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ కేకే సంతోష్, గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి తదితరులు ఉన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు