మైదానంలో విచిత్ర ఘటన

పుట్‌బాల్‌ మైదానంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ తరహా సంఘటనను చూసుండరు. కరబోవా కప్‌ ఫైనల్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. చెల్సీ, మంచేస్టర్‌ సిటీ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్లో చెల్సీ గోల్‌కీపర్‌ కెపా అర్రిజబల్గా ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 120 నిమిషాల గేమ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో షూట్‌ ఔట్‌కు దారి తీసింది. అయితే మైదానంలో ఉన్న కెపా స్థానంలో మరో గోల్‌కీపర్‌ విల్లీ క్యాబెల్లెరోను సబ్‌స్ట్యూట్‌గా పంపించాలని జట్టు కోచ్‌ భావించారు. అయితే దీనికి కెపా అంగీకరించలేదు. బయటకు రావలని కోచ్‌ మౌరిజియో సర్రి ఆదేశించినా అతను వినలేదు.  రానుపో​ అంటూ సైగలు చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top