ఆయనను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి వెకిలిగా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడును ఇకపై శునకానంద పార్టీ అధ్యక్షుడు అని పిలవాలంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగి పది రోజులు గడుస్తున్నా ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిందితులను పట్టుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కేసులో ఏ1 ముద్దాయి చంద్రబాబేనని అందుకే విచారణను నీరు గారుస్తున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్ జగన్ను అడ్డుకునే దమ్ము ధైర్యంలేకనే బాబు ఇలా కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగన్నేనని సర్వేలన్నీ వెల్లడిస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు ఇలా దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని రోజా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని లేని సంస్థలతో దర్యాప్తు జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు