సిట్ అధికారులతో సీఎం సమావేశం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ‘సిట్’ అధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం విశాఖ ఎయిర్పోర్టులో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుట్ర గుట్టు వెలుగులోకి రాకుండా ప్రభుత్వ పెద్దలు దర్యాప్తు అధికారులను కట్టడి చేస్తున్నారని, ముందస్తు నిర్ధారణ ప్రకారం విచారణ సాగుతోందనే విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న ఇద్దరు కీలక అధికారులు సైతం ఒకటి రెండు రోజుల క్రితం అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారిస్తున్న తరుణంలో అసాధారణ రీతిలో సిట్ అధికారులతో చంద్రబాబు సమావేశం కావడం కేసు విచారణను ప్రభావితం చేయటమేనని పరిశీలకులు, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు