మువ్వన్నెల జెండాతో చిందేసిన లదాఖ్ ఎంపీ
జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో లదాఖ్ ఎంపీ జమ్యంగ్ త్సెరింగ్ నమగ్యాన్ చేసిన ప్రసంగం.. ఆయన్ని ఓవర్ నైట్ స్టార్గా మార్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ పెద్దలు అభినందించారు. ఈ ఒక్క ప్రసంగంతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్యంగ్.. తొలిసారిగా ఆదివారం సొంత గడ్డపై అడుగుపెట్టారు. దీంతో లదాఖ్ నియోజకవర్గం ప్రజులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో ఆయన స్థానికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు