ఏపీ గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్
ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ను ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒడిశా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా నియమితులైన ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పటివరకు నూతన ఆంధ్రప్రదేశ్కు కూడా గవర్నర్గా కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్త గవర్నర్ను నియమిస్తారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరసింహన్నే తెలుగు రాష్ట్రాల గవర్నర్గా కొనసాగిస్తూ వచ్చింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు