నాపై ఉంచిన బాధ్యతను వమ్ముచేయను
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డివి ఫేయిర్ పాలిటిక్స్ అని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడివి విన్నింగ్ పాలిటిక్స్ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భీమిలిలో 650 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. అవినీతికి పాల్పడలేదని, ఒక్కపైసా తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘నేను దేవుడ్ని నమ్ముతాను.. అలాగే ప్రజలను నమ్ముతాను.. నాపై ఉంచిన బాధ్యతను వమ్ముచేయన’’ని అన్నారు. 15 నియోజకవర్గాల్లో ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టేందుకు కట్టుబడి ఉంటానన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు