సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం

అమెరికా పర్యటనకు బయల్దేరిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాషిం‍గ్టన్‌ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూల్స్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అదే విధంగా భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌(ఐఏఎస్‌) కూడా సీఎం జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. కాగా వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా- ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు సీఎం జగన్‌ విందులో పాల్గొంటారు. ఇదిలా ఉండగా.. అమెరికా పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉండటం వల్ల సీఎం జగన్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే స్వయంగా ఖర్చులు భరించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top